GDWL: పెరుగుతున్న ఎండల దృష్ట్యా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పని వేళలను ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటలకే పరిమితం చేయాలని ఐఎఫ్టీయూ (IFTU) జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్ డిమాండ్ చేశారు. సోమవారం కార్మికులతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో సుమారు 1200 మంది కార్మికులు ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారన్నారు.