SKLM: జి. సిగడాం మండలం దేవరవివలస గ్రామంలో మడ్డువలస ఫేజ్–2 ఆధునీకరణ పనులను ఎమ్మెల్యే ఈశ్వరరావు సోమవారం ప్రారంభించారు. రైతులకు సాగునీరు సమృద్ధిగా అందేలా ఈ పనులు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. నాణ్యతతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.