SDPT: మర్కూక్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కవిత రామ్మోహన్ రెడ్డి, స్థానిక ఎస్ఐ దామోదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు మరియు బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమానమేనని అని అన్నారు.