MHBD: మహబూబాబాద్ పట్టణంలో ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని టౌన్ సీఐ మహేందర్ రెడ్డి సూచించారు. నిన్న రాత్రి రైల్వే స్టేషన్, బస్టాండ్లలో సాధారణ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసి, వారి ఆధార్ కార్డులను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ను సంప్రదించాలని ఆయన తెలిపారు.