AKP: ఎలమంచిలి సబ్ డివిజన్ పరిధిలో అభ్యుదయ రైతులు ఇవాళ ఉదయం విజ్ఞాన యాత్రకు బస్సులో బయలుదేరి వెళ్లారు. జిల్లా వ్యవసాయ అధికారి ఆశాదేవి జండా ఊపి ప్రారంభించారు. పోలవరం జిల్లా పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి ఆధునిక వ్యవసాయ పద్ధతులు గురించి తెలుసుకుంటారని ఆమె పేర్కొన్నారు. రైతుల వెంట వ్యవసాయ అధికారులు మోహన్ రావు, సరోజినీ వెళ్లారన్నారు.