JN: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కాంగ్రెస్ యువ నాయకులు ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ బాలమణి అన్నారు. జనగామలో మున్సిపల్ కౌన్సిలర్లతో వారు సమావేశమయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని వారు కౌన్సిలర్లకు సూచించారు.