KMR: కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు అడూర్ నియోజకవర్గానికి రాహుల్ గాంధీ విచ్చేస్తున్న నేపథ్యంలో,ఆదివారం జుక్కల్ MLA తోట లక్ష్మీ కాంతారావు ఏర్పాట్లను పరిశీలించారు. ఏఐసీసీ పరిశీలకుడిగా ఉన్న ఆయన, పార్టీ ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు.