HNK: 47వ డివిజన్ బాపూజీ నగర్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు భూమి పూజ చేశారు. ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని వారు అన్నారు. అనంతరం 47వ డివిజన్ ముఖ్య నేతలతో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.