RR: భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కొండి రాములు సంతాప సభ గోడపత్రికను ఈరోజు చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని భూపోరాట కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర నాయకులు రామస్వామి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొండి రాములు కార్మికుల, కర్షకుల కోసం పోరాడిన నాయకులు అని కొనియాడారు.