SRCL: చందుర్తి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ వసంతాల వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు జెండా గద్దె వద్ద టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లింగంపల్లి వెంకటి, మెంగని హన్మాండ్లు, మర్రి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.