TG: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి మహా పట్టాభిషేకం అనంతరం నిన్న రాత్రి స్వామివారు రథోత్సవంపై భక్తులకు దర్శనమిచ్చారు. సీతమ్మ సమేతంగా భద్రాద్రి రామయ్య సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై పట్టణ పురవీధుల్లో విహరించారు. ‘జై శ్రీరామ్’ నినాదాలతో భద్రగిరి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.