TG: యువతను గొప్ప మానవ వనరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. యువ భారత్ రన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శారీరక దృఢత్వం ఉంటేనే మానసిక వికాసం సాధ్యమని, యువత ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణను అలవరుచుకోవాలని సూచించారు. టెక్నాలజీని వాడుకుంటూనే, మన సంస్కృతిని తల్లిదండ్రులను గౌరవించడం మర్చిపోవద్దని ఆయన పిలుపునిచ్చారు.