జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా ధర్మపురికి చెందిన సంఘనబట్ల దినేష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి యోగితా రాణి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లక్ష్మణ్ కుమార్లకు దినేష్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలకు కృషి చేస్తానన్నారు.