మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని కోరారు. చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండటం వల్ల ప్రాణ నష్టాన్ని అరికట్టవచ్చని సూచించారు.