SRD: మద్యం తాగి వాహనాలు నడపొద్దని సిర్గాపూర్ ఎస్సై మహేష్ అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక సిర్గాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డుపై వాహనాలను నిదానంగా నడిపి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని వాహనదారులకు సూచించారు. వాహనం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు.