ADB: బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ఏప్రిల్ 6న నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేయాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఆదేశించారు. ఏప్రిల్ 6న ఉదయం 11 గంటలకు CM బాసరకు చేరుకుని పూజలు నిర్వహిస్తారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 2 గంటలకు పిప్పిరి చేరుకుని సభలో ప్రసంగిస్తారు.