ASR: దుంప జాతి పంటల ప్రాముఖ్యత, వినియోగంపై భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్త డా. మురుగేశన్ గిరి రైతులకు అవగాహన కల్పించారు. శనివారం డుంబ్రిగుడ(M) గసభ గొందివలస గ్రామంలో దుంప జాతి పంటల పరిరక్షణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేరళ నుంచి తెచ్చిన కొత్త రకాల దుంపలను రైతులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాసన్ సంస్థ ప్రతినిధులు నరసింగరావు, ప్రసాదరావు పాల్గొన్నారు.