SDPT: చేర్యాల మండలం ఆకునూరులో ఎంపీవో, సర్పంచ్ కొమ్ము రవి ఆధ్వర్యంలో శనివారం తైబజార్, 7 షెటర్లకు బహిరంగ వేలం నిర్వహించారు. తైబజారును అందె నానిబాబు రూ.54,500లకు దక్కించుకోగా, షెటర్ల వేలం ద్వారా మొత్తం రూ.3,70,500 ఆదాయం సమకూరింది.గత 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న షెటర్ల వేలం ప్రక్రియను ప్రస్తుత సర్పంచ్ విజయవంతంగా పూర్తి చేయడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.