MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. శనివారం లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక బడ్జెట్ పై చర్చించి ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, పన్నుల వసూలుతో వచ్చే నిధులను ప్రతిపాదిత పనులకు వినియోగించాలన్నారు.