ATP: కళ్యాణదుర్గం మండలం పాలవాయిలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా ఇబ్బందులు ఉంటే ప్రజలు నేరుగా 9550480972 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.