KRNL: ఆలూరులో జరుగుతున్న ఏఐటీయూసీ 24వ జిల్లా మహాసభలకు కోడుమూరు మండలం నుంచి సీపీఐ, ఏఐటీయూసీ నేతలు శనివారం తరలివెళ్లారు. ఎర్రజెండాలు చేతబూని నినాదాలు చేస్తూ బయలుదేరిన కార్యకర్తలు మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు, వామపక్ష నాయకులు పెద్దఎత్తున హాజరవుతున్నారని వారు తెలిపారు.