WGL: జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల డిప్యూటేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో దివ్యాంగులకు మినహాయింపు ఇవ్వాలని అధికారులను దివ్యాంగుల నాయకుడు సురేష్ కోరారు. ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి బదిలీ కావడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించి దివ్యాంగులకు బాసటగా నిలవాలని కోరారు.