PDPL: R&B ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టర్ శ్రీహర్ష శనివారం సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. పెద్దపల్లి- కాటారం రోడ్డు విస్తరణ, బ్రిడ్జి నిర్మాణ పనులు, లింగాపూర్ రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మానేరు నదిపై నిర్మించే బ్రిడ్జి టెండర్, మంథని గెస్ట్ హౌస్ నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.