GDWL: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం గద్వాలలోని విశ్వేశ్వరయ్య, విశ్వభారతి పాఠశాలల కేంద్రాలను తనిఖీ చేశారు. వైద్య శిబిరాలు, మౌలిక వసతులు ఉండేలా చూడాలని సూచించారు. ప్రశ్నపత్రాలను పోలీస్ ఎస్కార్ట్తో తరలించి, జవాబుపత్రాలను తపాలా కార్యాలయంలో భద్రపరచాలని తెలిపారు.