చిన్నస్వామి స్టేడియం వేదికగా SRHతో RCB జట్టు తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కర్ణాటక క్రికెట్ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రారంభ మ్యాచ్ కోసం ఒక స్టాండ్ మొత్తాన్ని కర్ణాటక ఎమ్మెల్యేల కోసం కేటాయిస్తున్నట్లు సమాచారం. అలాగే, గతేడాది తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన 11 మందికి గుర్తుగా ప్రతి మ్యాచ్లోనూ 11 సీట్లను కేటాయించాలని RCB నిర్ణయించింది.