KDP: మహాకవి పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పుట్టపర్తి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన మహానుభావుడని కొనియాడారు. ‘శివతాండవ కావ్యం’ వంటి అద్భుత రచనలతో తెలుగు సాహిత్యంలో అగ్రస్థానాన్ని సంపాదించారని పేర్కొన్నారు.