ప్రకాశం: కంభం మండలం లింగోజిపల్లిలో శ్రీరామనవమి పండగ పురస్కరించుకొని శనివారం ఎడ్ల పందాల పోటీలను నిర్వహించారు. వైసీపీ ఇంఛార్జ్ కేపీ నాగార్జున రెడ్డి హాజరై ప్రారంభించారు. అంతక ముందు రాముల వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.