WGL: ఖానాపూర్ మండలం రంగాపురం గ్రామంలోని కోదండ రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు సమర్పించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.