PLD: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. స్థానిక నరసరావుపేటలోని శ్రీ కాసు రాఘవమ్మా బ్రహ్మానందరెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.