KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తి వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్చకులు విష్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కంకణధారణ వంటి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక మొత్తంలో పాల్గొన్నారని ఆలయ అధికారులు తెలిపారు.