W.G: కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చదలవాడ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహనిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో నిర్మించిన 5,056 టిడ్కో గృహాలను (తాడేపల్లిగూడెం 1,120, పాలకొల్లు 2,016, భీమవరం 1,920) మార్చి 30న లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. వివిధ నియోజకవర్గాల్లో పూర్తయిన మరో 259 గృహాలను అందజేస్తామన్నారు.