VSP: వరాహ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక కళ్యాణోత్సవం (మార్చి 29), చందనోత్సవం (ఏప్రిల్ 20) ఏర్పాట్లను ఈవో జల్లేపల్లి వెంకట్రావు పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, సౌకర్యాలు మెరుగుపర్చాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, లైటింగ్, సూచిక బోర్డులు, వాష్రూమ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.