TPT: పిచ్చాటూరు మండలానికి చెందిన కె.వి. భాస్కర్ నాయుడు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీలక బాధ్యత తనపై ఉంచిన విశ్వాసానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు.