GNTR: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 20కి పైగా అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికు చట్టబద్ధత కల్పించే దిశగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది.