SKLM: రణస్థలం మండలం పాతర్లపల్లిలో గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే ఈశ్వర్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువు పట్ల ఆసక్తి పెంపొందించడానికి గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. యువతకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.