ATP: అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ను ఏపీ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు వెంకటప్ప కలిశారు. జిల్లాలోని గిరిజన తండాల్లో సీసీ రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. కిలిమంజారో పర్వతం అధిరోహించిన చిన్ని కృష్ణ నాయక్కు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. గిరిజన సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.