NDL: తమ హక్కుల సాధన కోసం జీవో 98 బాధితులు గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నంది కొట్కూరులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద శాంతి యుత దీక్ష చేపట్టిన బాధితుడు జయన్న మాట్లాడారు. జీవో 98 ద్వారా ఉద్యోగాలు సాధించాడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.