CTR: పుంగనూరు మండలం కూరప్పల్లి గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం రైతు మునస్వామికి చెందిన మామిడి తోటలో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు సిబ్బంది మంటలను ఆర్పేశారు. రూ.20 వేల వరకు పంట నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయారు.