కామారెడ్డి: మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నేడు బిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి మహిళ డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగారెడ్డి, IKP ఏపీఎం సాయిలు, డ్వాక్రా మహిళలు ఉన్నారు.