కర్నూలు: నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న మహిళలకు బీసీ సంక్షేమ శాఖలో పదవీ విరమణ చేసిన వసతి గృహ సంక్షేమాధికారి కేటీ బాబు, రమాదేవి దంపతులు వస్త్రాలను పంపిణీ చేశారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగలను పురస్కరించుకుని ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.