NDL: ప్యాపిలి మండలం కల్చట్ల గ్రామంలో అనారోగ్యంతో ఉన్న సీనియర్ వైసీపీ నాయకుడు బాలా అంజిని మాజీ మంత్రి కుమారుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాలా అంజి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక నాయకులు వెంకటేశ్వర రెడ్డి, రజినీకాంత్ రెడ్డి ఉన్నారు.