GNTR: అమరావతిలో ఈ నెల 11న L&T, 23న మెగా ఇంజినీరింగ్ కంపెనీల వద్ద జరిగిన అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం ప్రత్యేక బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో బృందం పనిచేయనుంది. బృందంలో నలుగురు SIలు, నలుగురు Clలు, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. ఘటనలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో తుళ్లూరు CI, DSP ఉన్నట్లు సమాచారం.