VSP: గాజువాక 64వ వార్డు యాతపాలెంలో ఎకరా స్థలంలో ఆధునిక పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం డైరెక్టర్ మొల్లి పెంటిరాజు స్థలాన్ని పరిశీలించారు. కాలుష్యం తగ్గించేందుకు చెట్లు నాటి పార్కుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచనలతో APIIC నిధులతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు.