MBNR: మిడ్జిల్ మండలం రాణిపెట్ గ్రామంలో గురువారం ఎంపీడీవో గీతాంజలి నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు మొక్కలకు నీరు అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో హైమావతి, పంచాయతీ కార్యదర్శి సుదర్శన్, మేట్ ఫర్హాన, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.