KRNL: ఆస్పరి మండలం నగరూరు గ్రామంలోని సమాధుల్లో ఇళ్లు కట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. జగన్న కాలనీలో అభివృద్ధి పేరుతో రూ. 20 లక్షలు స్వాహా చేశారని, అవినీతిపరులపై కేసులు నమోదు చేసి నిధులను రికవరీ చేయించాలని శివప్రసాద్ డిమాండ్ చేశారు.