పార్వతీపురం పట్టణంలో కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నీటిలో నిలిచిపోయాయి. ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతమవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాశ్వత పరిష్కారం కోరుతున్నారు.