కడప: జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని 325 మందికి రూ.74,025 జరిమానా విధించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాలలో ప్రయాణించేవారు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని సూచించారు.