SKLM: జిల్లాలో 22ఏ భూముల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఎమ్మార్వోలకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అపరిష్కృత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ మేరకు 22 ఏ పట్ల అలసత్వం వహించరాదని తెలిపారు.