BHPL: గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో నవాబుపేట శివారులో గుట్టల మట్టిని అక్రమంగా తరలిస్తున్న శేషారెడ్డి సత్య రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేశ్ డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబట్టుతూ.. సహజ వనరుల దోపిడీ ఆపకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామ్, రామచందర్ మాదిగ పాల్గొన్నారు.