NLR: బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం పౌర్ణమి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. స్వామివారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అనంతరం రాత్రి 8 గంటలకు గరుడసేవ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.